
భారతదేశ జీవ వైవిధ్య చట్టం అమలుకు ఏర్పాటైన నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
ఒక ఆవరణ వ్యవస్థలోని జాతి వైవిధ్యాన్ని ఆల్ఫా వైవిధ్యం అంటారు.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్లను గుర్తించారు.
దేశంలో జీవ వైవిధ్య చట్టం 2002లో అమల్లోకి వచ్చింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో ఉంది.
దేశంలో అత్యధిక సంఖ్యలో ఆసియా సింహాలు గుజరాత్లోని గిర్ అడవుల్లో సంరక్షించబడుతున్నాయి.
సిక్కిం రాష్ట్ర జంతువు రెడ్ పాండా.
వన్యజీవుల పరిరక్షణకు లాబొరేటరీ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ హైదరాబాద్లో ఉంది.
అంతర్జాతీయ జీవవైవిధ్య సంరక్షణ ఒప్పందానికి సంబంధించిన 14వ సదస్సు 2018లో ఈజిప్టులోని షర్మ్ – ఎల్ – షేక్లో ఉంది.
తిమింగలాల, డాల్ఫిన్ల వేటను నియంత్రించే ఉద్దేశంతో ఏర్పాటైన ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ ప్రధాన కార్యాలయం కేంబ్రిడ్జ్లో ఉంది.
ఎక్స్ సిటు జీవవైవిధ్య సంరక్షణ పద్ధతికి ఉదాహరణ కణజాల వర్థనం, జంతు ప్రదర్శనశాలలు, గ్రీన్ హౌస్.
కడలుండి కమ్యూనిటీ రిజర్వు కేరళలో ఉంది.
రెడ్ పాండా, పెద్దపులి, ఢోల్ను ఎండేంజర్డ్ జాతుల్లో భాగంగా గుర్తించబడింది.
మెగా బయోడైవర్సిటీ దేశంగా గుర్తింపు పొందిన దేశం అర్జెంటీనా.
పులుల సంరక్షణకు దేశాన్ని ఏడు భాగాలుగా భారత్ విభజించింది.
నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సెస్ కర్నల్ ఉంది.
స్పిషీస్ రికవరీ ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేక సంరక్షణలో ఉన్న జంతు జాతులు బెంగాల్ పులి, సాంగైదుప్పి, బట్టమేక పక్షి.
డీపోర్ బీల్ చిత్తడి నేల అసోంలో ఉంది.
ప్రపంచంలో మొత్తం 17 మెగా బయోడైవర్సిటీ కేంద్రాలను ఇప్పటివరకు గుర్తించారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
భారత్లో మొదటిసారిగా 1936లో ఏర్పరచిన తొలి కార్బెట్ జాతీయ పార్కును హెయిలీ జాతీయ పార్కు.
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల సంరక్షణ కోసం ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం రామ్సర్ కన్వెన్షన్.
1973, ఏప్రిల్ 1న పులుల సంరక్షణకు ఉద్దేశించిన ప్రాజెక్టు టైగర్ ప్రారంభమైంది.
రాయల్ బెంగాల్ టైగర్ శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో అమల్లోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక టైగర్ రిజర్వులను ఏర్పాటు చేశారు.
దేశంలోని హిమాలయాల్లో రెడ్పాండా కనిపిస్తుంది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కవాల్ టైగర్ రిజర్వ్ ఏర్పాటైంది.
ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం ఆస్ట్రేలియా.
కాంచనజంగా బయోస్పియర్ రిజర్వు సిక్కిం రాష్ట్రంలో ఉంది.
పిన్వ్యాలీ నేషనల్ పార్కు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం గిర్ అడవులు.
కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు.
ఇడుక్కి అభయారణ్యం కేరళ రాష్ట్రంలో ఉంది.
గ్రేట్ హార్న్బిల్ అనేది కేరళ రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ పక్షి.
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది.
దేశంలో అంతరించే ప్రమాదమున్న జంతువుల పరిరక్షణకు ఉద్దేశించిన ప్రయోగశాల లేబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పిషీస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.
భారత్లో మొత్తం 54 టైగర్ రిజర్వులను ఏర్పాటు చేశారు.
కనీసం 70శాతం ఆవాసాన్ని కోల్పోయి 1500 ఎండమిక్ ఆవృతబీజ జాతులున్న భౌగోళిక ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారు.
వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22న జరుపుకుంటారు.
భారత్లో ఉభయచర జీవుల వైవిధ్యం అధికంగా పశ్చిమ కనుమలులో ఉంది.