![బిట్ బ్యాంక్..తెలంగాణ నదీ వ్యవస్థ](https://static.v6velugu.com/uploads/2024/01/geography-of-telangana-river-system_WsBMAXfh8N.jpg)
నదుల గురించి అధ్యయనం చేయడాన్ని పొటమాలజీ అని పిలుస్తారు.
మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు.
భారతదేశంలో నవంబర్ 24 నుంచి 27 వరకు నదీవారం నిర్వహిస్తారు.
సుస్థిరాభివృద్ధికి నీటిపై చర్య అంతర్జాతీయ దశాబ్దం 2018–2018.
దక్షిణ భారతదేశంలో పరివాహక ప్రాంతం ఆధారంగా అతి పెద్ద నది గోదావరి.
తెలంగాణలో గోదావరిని కలిసే మొదటి ఉప నది మంజీర.
తెలంగాణలో గోదావరిని కలిసే చివరి ఉప నది ఇంద్రావతి.
గోదావరి, మంజీర కలిసే ప్రాంతం బాదనకుర్తి.
గోదావరి, ప్రాణహిత నదలు కలిసే ప్రాంతం కాళేశ్వరం.
గోదావరి నది తెలంగాణలో ఎనిమిది జిల్లాల గుండా ప్రవహిస్తోంది.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి.
గోదావరి నది మొత్తం పరివాహక ప్రాంతం 3,12,812.
గోదావరి నది ఏర్పాటు చేసిన నదీ ఆధారిత దీవి బాదనకుర్తి.
ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది.
గోదావరి నది చెగ్గాం,పెద్దపల్లి, జగిత్యాల సరిహద్దు ప్రాంతంలో చంద్రవంక ఆకారంలో ప్రవహిస్తుంది.
దక్షిణ త్రివేణి సంగమం ఏర్పాటు చేసే నది గోదావరి.
గోదావరి నది జన్మస్థానం త్రయంబకేశ్వరం.
గోదావరి తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం కందకుర్తి.
గోదావరి పరివాహక ప్రాంతం అధికంగా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర.
గోదావరి పరివాహక ప్రాంతం అతి తక్కువ కలిగిన రాష్ట్రం కర్ణాటక.
గోదావరి దక్షిణ త్రివేణి సంగమాన్ని కాళేశ్వరం ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది.
తెలంగాణలో గోదావరి నది పొడవు 520 కి.మీ.
సహ్యాద్రి కొండల్లో గోదావరి నది ప్రవహిస్తుంది.
గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ.
తెలంగాణలో దక్షిణ వాహినిగా ప్రవహించే నది గోదావరి.
గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో 19.87శాతం ఉంది.
ఇండియన్ రైన్ అని గోదావరి నదిని పిలుస్తారు.
కోటిలింగాల క్షేత్రం గోదావరి నదీ ఒడ్డున ఉంది.
మంజీరా నది జన్మస్థానం బాలాఘాట్ కొండలు.
మంజీరా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది.
మంజీరా నదిని మహారాష్ట్రలో మాంజ్రా అనే పేరుతో పిలుస్తారు.
మంజీరా నది పొడవు 724 కి.మీ.
ఒడిశాలోని తూర్పు కనుమల్లోని సికారం కొండల్లో జన్మించే నది శబరి.
ఒడిశాలో కొలాబ్ నది అని హరిద్రను పిలుస్తారు.
ఇంద్రావతి నది జన్మస్థానం కలహండి.
చిత్రకూట్ జలపాతాన్ని ఏర్పాటు చేసే నది ఇంద్రావతి.
పెన్గంగా నది జన్మస్థానం అజంతా శ్రేణి.
లెండి నది మంజీర నదికి ఉపనది.
గోదావరి ఉప నదుల్లో అతి పెద్ద నది శబరి.
ప్రాణహిత నది తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల గుండా ప్రవహిస్తోంది.
మానేరు నది జన్మస్థానం సిరిసిల్లకొండ.
మానేరు నది గోదావరిలో అన్నారం బ్యారేజీ వద్ద కలుస్తుంది.
కడెం నది జన్మస్థానం బోతాయిపల్లి.
ఇంద్రావతి నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం భద్రకాళి.
కరీంనగర్ పట్టణం మానేరు నది ఒడ్డున ఉంది.
వార్దా నది జన్మస్థానం ముల్తాయి తహశీల్.
కడెం నది ఏర్పాటు చేసే అతి ఎత్తయిన జలపాతం కుంతాల.
గోదావరి, మంజీరా నదులతో కలిసి సరస్వతి నది కందకుర్తి వద్ద త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేస్తుంది.
కడెం నది గోదావరిని కలిసే ప్రాంతం పసుపుల గ్రామం.
కిన్నెరసాని నదీ జన్మస్థానం తాడ్వాయి.
పెన్గంగా నదికి ఉపనది సత్నాల. ఈ నది ఆదిలాబాద్ జిల్లాలో ప్రవహిస్తుంది.
కృష్ణా నదీ జన్మస్థానం మహాబలేశ్వర్ సమీపంలోని జోర్ గ్రామం.
కృష్ణా నదీ జన్మించే రాష్ట్రం మహారాష్ట్ర.
కృష్ణా నదీ మొత్తం పొడవు 1260 కి.మీ.
శిల్పుల నది అని కృష్ణా నదిని పిలుస్తారు.
కృష్ణా నది మొత్తం పరివాహక ప్రాంతం 2,58,948 చ.కి.మీ.
భారతదేశంలో మూడో అతి పొడవైన నది కృష్ణ.
కృష్ణా నది ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం తంగెడి.
కృష్ణా నది ప్రీతి సంగమం ఏర్పాటు చేసే ప్రాంతం సతారా.
దివిసీమను ఏర్పరిచే నది కృష్ణ.
కృష్ణా ఉప నదుల్లో అతి పెద్దది తుంగభద్ర.