
హెల్సెంకీ నియమం నదీ జలాల పంపిణీ గురించి తెలుపుతుంది.
అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో చేశారు.
కృష్ణా జలాల వివాదంపై మొదటి ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్.
కృష్ణా ట్రిబ్యునల్ –1ను 1969లో ఏర్పాటు చేశారు.
బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీ చేస్తూ 1973లో తీర్పు ఇచ్చింది.
బచావత్ ట్రిబ్యునల్ తన తీర్పులో ప్రకటించిన మొత్తం కృష్ణా నికర జలాలు 2060 టీఎంసీలు.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీల నికర జలాలను కేటాయించింది.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది.
బచావత్ ట్రిబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీల నీరు కేటాయించింది.
1977లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లు మానవీయ కోణంలో ఆలోచించి చెన్నై నగరానికి 15 టీఎంసీల తాగునీటిని సరఫరా చేసేందుకు అంగీకరించారు.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జలాలను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 512: 299 టీఎంసీలు పంచుకుంటున్నాయి.
చెన్నై నగరానికి తాగునీటిని తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్నారు.
కృష్ణా ట్రిబ్యునల్ –2ను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అని కూడా పిలుస్తారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పడింది.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ తన తీర్పును 2010లో ప్రకటించింది.
బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1001 టీంఎసీల కృష్ణా జలాలను కేటాయించారు.
రాష్ట్ర స్థూల నీటిపారుదల విస్తీర్ణం 20.27 లక్షల హెక్టార్లు.
తెలంగాణలో మొత్తం నీటిపారుదలలో 89శాతం బావుల ద్వారా సాగవుతుంది.
అత్యధిక శాతం నీటిపారుదల వసతులు కలిగిన జిల్లా మేడ్చల్.
అత్యల్ప శాతం నీటిపారుదల వసతులు కలిగిన జిల్లా ఆదిలాబాద్.
రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగయ్యే వ్యవసాయ భూమి 1.21 లక్షల హెక్టార్లు.
తెలంగాణలో కాలువల ద్వారా సాగయ్యే వ్యవసాయ భూమి 3శాతం.
జాతీయ జల విజ్ఞాన సంస్థను 1979లో స్థాపించారు.
జాతీయ జల విజ్ఙాన సంస్థ ప్రధాన కార్యాలయం రూర్కీలో ఉంది.
చెలిమెల వాగు ప్రాజెక్టుకు ఎన్టీఆర్ సాగర్ అని కూడా పిలుస్తారు.
గోదావరి జలాల్లో తెలంగాణకు 337 టీఎంసీలు కేటాయించారు.
గోదావరి నది జలాల పంపిణీ కోసం బచావత్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు.
గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1480 టీఎంసీలు కేటాయించారు.
జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు.
గోదావరి జల వివాద ట్రిబ్యునల్ను కేంద్రం 1969, ఏప్రిల్ 10న ఏర్పాటు చేసింది.
నిజాం కాలంలో 330 టీఎంసీల సామర్థ్యంతో పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో నదీ పరివాహక ప్రాంతం, భాగస్వామ్య రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలు, ప్రాంతాల వెనుకబాటుతనం ఆధారంగా నీటి కేటాయింపులు జరిగాయి.
58 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన నిజాంసాగర్ ప్రాజెక్టును 1931లో నిజాం ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేసింది.
నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇసుక మేటలురాకుండా నిరోధించడానికి, పైభాగంలో 38 టీఎంసీల సామర్థ్యంతో దేవనూర్ ప్రాజెక్టు నిర్మించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతంలో 79శాతం తెలంగాణ ప్రాంతంలో ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లాకు సాగునీరు అందించే కాలువ సరస్వతి కాలువ.