సాహిత్యోద్యమాలు
- 1911లో కనకతార నాటకం రచించి ఆధునిక నాటక రచనకు చందాల కేశదాసు పునాది వేశారు.
- 1913 డిసెంబర్ హితబోధిని సంచికలో స్త్రీలు విద్యలోనూ కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధం కావాలని రత్నమాంబదేశాయి అద్భుతమైన పద్యాలు రాశారు.
- జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం,
- భూదానోద్యమం, సహకారోద్యమంలో కోదాటి నారాయణరావు ప్రధాన పాత్ర వహించింది.
- కోదాటి నారాయణరావు ప్రగతి, బాలసరస్వతి అనే పత్రికలు నిర్వహించారు.
- ఆంధ్రసారస్వత పరిషత్తును కోదాటి నారాయణరావు స్థాపించారు.
- పాశం నారాయణ రెడ్డి రచనలు దయానంద సరస్వతి జీవిత చరిత్ర (బుర్ర కథ),
- త్యాగమూర్తులు, సదాశివరెడ్డి పద్య కావ్యం.
- మిత్ర ధర్మం కోసం నిజాంను ఎదురించిన
- పాపన్నపేట సంస్థానాధీశుడు సదాశివరెడ్డి.
- తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా స్థాపించబడ్డ మొదటి సాహిత్య సంస్థ సాహితి మేఖల.
- సాహితి మేఖల సంస్థను 1936లో నల్లగొండలో అంబటిపూడి వెంకటరత్నశాస్త్రి
- ప్రారంభించారు.
- సాహితి మేఖల సంస్థ దాశరథి రంగాచార్య రచించిన అగ్నిధార, అంబడిపూడి వెంకటరత్నం రచించిన తుర్క భాష, పున్నం అంజయ్య రచించిన నీలగిరి కవుల సంచిక, పులిజాల
- గోపాలరావు రచించిన ఖడ్గతిక్కన గ్రంథాలను ప్రచురించారు.
- 1939లో సాధన సమితి అనే సంస్థను బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెలుదుర్తి మాణిక్యాలరావు స్థాపించారు.
- 1941, నవంబర్ 20న సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహిత్య సంస్థ విజ్ఞాన వర్ధిని పరిషత్తు.
- విజ్ఞానవర్ధిని పరిషత్తు ద్వారా ప్రచురితమైన ప్రతాపరెడ్డి రచనలు రామాయణ విశేషాలు, మృత్యు సిద్ధాంతం, ఆంధ్రప్రతాపరుద్ర
- యశోభూషణం.
- 1943 మే 26న తెలుగు భాషా వ్యాప్తి కోసం రెడ్డి హాస్టల్లో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థ ఆవిర్భవించింది.
- నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్ 1949 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ పేరుతో వ్యవహరించబడుతోంది.
- నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, బూర్గుల రంగనాథరావు.
- నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్కు అధ్యక్ష కార్యదర్శులుగా లోక్నంది శంకరనారాయణరావు, బిరుదు వెంకటరెడ్డి పనిచేశారు.
- కావ్యాలంకార సంగ్రహాన్ని సూర్యనారాయణ శాస్త్రి రచించారు.
- సారస్వత వ్యాసముక్తావళిని బూర్గుల రామకృష్ణారావు రచించారు.
- శాలివాహన గాథాసప్తశతి సారాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణశాస్త్రి రచించారు.
- సాహిత్య సోపానాలు అనే గ్రంథాన్ని దివాకర్ల వెంకటావధాని రచించారు.
- ఆంధ్రుల సాంఘిక చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి రచించారు.
- కృష్ణశాస్త్రి రచనలు పల్లె పదాలు, స్త్రీల పౌరాణిక పాటలు.
- మనదేశం అనే పుస్తకాన్ని దేవులపల్లి రామానుజరావు రచించారు.
- వీరగాథలు రచించింది రామకృష్ణశర్మ.
- మిఠాయి చెట్టు అనే గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించారు.
- ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీగా మారింది.
- రావి నారాయణరెడ్డి స్థాపించిన సాహితీ సంస్థ వైతాళిక సమితి.
- రైతులపై బోయినపల్లి విశ్వనాథరావు పద్యాలు రాశారు.
- గాంధీజీ హరిజనోద్ధరణ, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమాల ప్రభావంతో దళితుల మీద జొన్నలగడ్డ హన్మంతరెడ్డి పద్యాలు రచించారు.
- దళితులపై కవిత్వం రాయడమే కాకుండా వారి కోసం పాఠశాల నడిపిన కవి శాయిరెడ్డి.
- తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆంధ్రకు వెళ్లిన తెలంగాణ వాళ్లను ఛీత్కరిస్తూ ఆదరాభిమానములు అనే కవితను ధవళా శ్రీనివాసరావు రచించింది.
- బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావ్ కొడుకో నైజాం సర్కరోడా అనే పాటను రాసి సాయుధ పోరాటాన్ని ఉర్రూతలూగించింది బండి యాదగిరి.
- తెలంగాణ అంతటా మారుమ్రోగిన పసులగాసే పోరగాడా పాలుమరసి ఎన్నాల్లయ్యిందో అనే పాటను సుద్దాల హన్మంతు రచించారు.
- సైసై గోపాలరెడ్డి! నీవు నిలిచావు ప్రాణాలొడ్డి అంటూ తిరునగరి రామాంజనేయులు స్మృతి గీతాలు రచించారు.
- మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన, మన పిల్లల చంపి మనల బంధించిన అంటూ ఉద్యమ సందేశాన్ని కాళోజీ నారాయణరావు అందించారు.