బిట్​ బ్యాంక్ : కాకతీయుల కాలంనాటి మతం

బిట్​ బ్యాంక్ : కాకతీయుల కాలంనాటి మతం
  • కాకతీయుల మొదటితరానికి చెందిన పాలకులు జైన మతం ఆచరించారు. 
  • ప్రోలరాజు అనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ఆరంభమైంది. 
  • ప్రతాపరుద్రుని కాలం నాటి జైన కవి అపయార్యుడు. ఇతను రచించిన గ్రంథం జినేంద్ర కళాభ్యుదయం
  • తొలి కాకతీయులు కాలాముఖ శైవశాఖను ఆదరించారు. 
  • అనుమకొండ శాసనం ప్రకారం రెండో బేతరాజు శ్రీశైలంలోని మల్లికార్జున శిలా మఠం అధిపతి రామేశ్వర పండితుడి శిష్యుడు. 
  • కాళేశ్వరంలో శివలింగాన్ని రామేశ్వర పండితుడు ప్రతిష్ఠించాడు.  
  • కాకతీయుల కాలంలో తెలంగాణలోని కాలాముఖ శైవ క్షేత్రాలు ధర్మపురి (కరీంనగర్​), అనుమకొండ (వరంగల్​), ఐనవోలు (వరంగల్), పానగల్లు (నల్లగొండ), నిజామాబాద్​, నందికంది(సంగారెడ్డి), శనిగరం (కరీంనగర్​).
  • గణపతి దేవుని గురువు ధర్మశిశుడు. 
  • గణపతిదేవుని కాలంలో పలు శైవగోళకీ మఠాలను స్థాపించి విశ్వేశ్వర శివదేశికుడు రాజగురువు స్థానం పొందాడు. 
  • రుద్రమదేవి గురువు విశ్వేశ్వర శివదేశికుడు.
  • రుద్రమదేవి విశ్వేశ్వర శివదేశికునికి కృష్ణా నదీ తీరంలో ఉన్న మందర గ్రామం(దీన్నే విశ్వేశ్వర గోళకీమఠం అంటారు) దానంగా ఇచ్చింది. 
  • కాకతీయుల నాణేల మీద వరాహ లాంఛనం ఉండేది.
  • రుద్రదేవుడు అనుమకొండలో త్రికూట రుద్రేశ్వర ఆలయం నిర్మించారు.
  • రుద్రమదేవుని మంత్రి వెల్లంకి గంగాధరుడు అనుమకొండలో ప్రసన్నకేశవస్వామి ఆలయం నిర్మించారు. 
  • గణపతిదేవుని సోదరి రాణి మైలాంబ గోపాలకృష్ణుడి దేవాలయాన్ని ఇనగుర్తిలో నిర్మించింది.
  • కావేరి తీరంలోని శ్రీరంగనాథస్వామి ఆలయానికి సకలవీడు గ్రామాన్ని దానం చేసిన రెండో ప్రతాపరుద్రుని సేనాని దేవరి నాయకుడు.
  • కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధ తెలుగు కవులు తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు, బద్దెన, కొలను గణపతిదేవుడు, రుద్రదేవుడు, ఏకామ్రనాథుడు, కాసె సర్వప్ప.
  • కాకతీయుల కాలంనాటి తెలుగు రచనలు ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర దశకుమారచరితం, పురుషార్థసారం, జైనేంద్ర కళ్యాణాభ్యుదయం, పండితారాధ్యచరితం, బసవపురాణం, శివయోగసారం, నీతిసారం, నీతిసార ముక్తావళి, ప్రతాపరుద్రచరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం. 
  • రెండో తైలవరాజు(క్రీ.శ.973–995) కాలానికి చెందిన తొమ్మిది అడుగుల ఎత్తు, ఏడు తలల నాగరాజు నీడలో ఉన్న పార్శ్వనాథ విగ్రహం మెదక్​ జిల్లా కుల్చారం గ్రామంలో లభించింది. 
  • కాకతీయుల కాలంలో నిర్మించిన కోటల్లో గోల్కొండ, రాచకొండ, భువనగిరి, ఓరుగల్లు ముఖ్యమైనవి. 
  • హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు1163 సంవత్సరంలో నిర్మించారు. 
  • వరంగల్​ జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్పగుడిని క్రీ.శ.1213లో గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రదేవుడు నిర్మించాడు. 
  • జాయపసేనాని నృత్త రత్నావళిలో పేర్కొన్న రీతుల ప్రకారం శిల్పాలు పాలంపేటలోని రామప్పగుడిలో చెక్కబడ్డాయి. 
  • తురుష్కుల దాడిలో ధ్వంసమై ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న స్వయంభూలింగ దేవాలయం వరంగల్​ కోటలో ఉంది.
  • రెండో ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యంలో 5,500 శైవ ఆలయాలు, 1300 వైష్ణవ ఆలయాలు, మల్లారదేవుని 2,400 గుళ్లు, భైరవ, దుర్గ, గణపతిదేవుళ్లకు కలిపి 4,400 గుళ్లు ఉన్నట్లు ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర పేర్కొంటుంది. 
  • కాకతీయుల మంత్రి మండలిలో సభ్యులు ప్రధానులు, అమాత్యులు, ప్రెగ్గడులు, సామంతులు, దండనాయకులు. 
  • గణపతిదేవుని మహా ప్రధాని మల్యాల హేమాద్రిరెడ్డి.
  • రెండో ప్రతాపరుద్రుని ప్రధాని ముప్పిడి నాయుడు.
  • రాజు ప్రతిదినం విధిగా మంత్రులతో సమావేశమై వివిధ అంశాలు చర్చించే వాడని గణపతిదేవుని కాలానికి చెందిన శివదేవయ్య రాసిన గ్రంథం పురుషార్థసారంలో పేర్కొన్నారు. 
  • కాకతీయ ప్రభువులు రాజ్య వ్యవహారాలను 72 తరగతులు లేదా నియోగాలుగా విభజించారు. 
  • కాకతీయుల కాలంలో రాజ్య వ్యవహారాలపై అధిపతి నియోగాధిపతి.
  • గణపతిదేవుని కాలంలో నియోగాధిపతి కాయస్థ గంగయసాహిణి.
  • రుద్రమాంబ కాలంలో నియోగాధిపతిగా త్రిపురారి, పొంకమల్లయ్య ప్రగడ వ్యవహరించారు.
  • కాకతీయుల కాలంనాటి కేంద్ర ప్రభుత్వంలో రాజు, మంత్రి మండలి, బహాత్తర నియోగాధిపతులు కీలక పాత్ర నిర్వహించారు.
  • పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయులు తమ రాజ్యాన్ని స్థలం, సీమ, నాడు, భూమిగా విభజించారు.