- కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
నిజామాబాద్, వెలుగు: ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలని కరీంనగర్ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్అంజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ లో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడారు.
యువ వికాసం పేరుతో యూత్ను మోసగించిన కాంగ్రెస్ తీరుపై విస్తృతంగా ప్రచారం చేయా లని సూచించారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
బీసీ బిడ్డను గెలిపించండి..– టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరముందని టీచర్స్ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య అన్నారు. బీసీ బిడ్డనైన తనను గెలిపించాలన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేష్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.