
భద్రాచలం, వెలుగు : భద్రాచలం రామాలయం అభివృద్ధికి బీజేపీ సర్కారు కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు రాష్ట్ర పార్టీ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం స్థానిక రామాలయంలో పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట బీజేపీ భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ తదితరులు ఉన్నారు.