
- అసెంబ్లీ చిట్చాట్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అవినీతిని వంద రోజుల్లో బయటపెడతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి.. 15 నెలలు గడుస్తున్నా.. ఎందుకు బయటపెట్టడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు ఒక్కొకటి బయటకు వస్తున్నాయని తెలిపారు.
శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. రేవంత్తో హరీశ్ రావు భేటీ తర్వాతే కేటీఆర్ చెన్నై వెళ్లారని, అక్కడ సమావేశం జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయట పడిందని చెప్పారు.