తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలి: బీజేపీ నేత మాధవీలత

తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలి: బీజేపీ నేత మాధవీలత

తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ  నేత మాధవీలత. స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయడం చిన్నవిషయం కాదన్నారు. దీనిపై హిందువులు ఏకతాటిగా పోరాడాలన్నారు. అన్యమతస్తులను ఎండోమెంట్ లో చేర్చడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక..అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. ప్రసాదం కల్తీ వివాదంతో పాటు స్వామివారి ఆస్తులపై కూడా విచారణ జరగాలన్నారు మాధవీలత.