
ఆర్మూర్, వెలుగు : సీఎం పిటిషన్ పై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్ మున్సిపల్ఆఫీస్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేసి కమిషనర్ గదికి మెమోరాండం అంటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ అవినీతి అక్రమాలపై సీఎంవోకు ఫిర్యాదు చేశామన్నారు.
144 అక్రమ ఇంటి నంబర్లు రద్దు చేశామని రిపోర్ట్ లో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ ఆ ఇంటి నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్ స్పెషల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకుని ఇంతవరకు మున్సిపల్ కు రాలేదన్నారు. కార్యక్రమంలో జెస్సు అనిల్కుమార్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, ఆరె రాజేశ్వర్, ద్యాగ ఉదయ్, పాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.