
నిజామాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ఢిల్లీలో మరో సెంట్రల్మినిస్టర్అమిత్షా చెప్పులు మోసే డ్యూటీ చేస్తున్నాడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు రాజ్యాంగంపై ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. సోమవారం ఆయన నిజామాబాద్రూరల్సెగ్మెంట్పరిధి కాలూరు విలేజ్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ప్రొగ్రామ్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు.
అమిత్షా పార్లమెంట్సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు దద్దమ్మల్లా సైలెంట్గా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ బుద్ధి అప్పుడు ఎటుపోయిందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్షాతో క్షమాపణలు చెప్పించకుండా ఆయన విగ్రహాన్ని శుద్ధి చేసే నైతిక హక్కు బీజేపీ లీడర్లకు లేదన్నారు. దేశంలో అంబేద్కర్ఆశయాలను మోస్తున్న నేత రాహుల్ గాంధీ ఒక్కరేనన్నారు.
ఆయన నాయకత్వంలో తెలంగాణ సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిందని, ఎస్సీ రిజర్వేషన్నిర్ణయిం తీసుకుందన్నారు. అనంతరం గ్రామంలో దళిత కుటుంబాలతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. ఆయనవెంట స్టేట్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్మన్మానాల మోహన్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ముప్ప గంగారెడ్డి, శేఖర్గౌడ్ తదితరులు ఉన్నారు.