![ఈటల రాజేందర్పై దాడి సిగ్గుచేటు : బీజేపీ](https://static.v6velugu.com/uploads/2022/11/MLA-Etala-Rajender_xn2zUayipr.jpg)
పద్మారావునగర్/ముషీరాబాద్/గండిపేట/ వికారాబాద్, వెలుగు : మునుగోడు మండలం మలివెలలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం గ్రేటర్వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. బన్సీలాల్ పేట బీజేపీ నాయకులు బోయిగూడ క్రాస్ రోడ్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో, కవాడిగూడలో కార్పొరేటర్ రచన శ్రీ ఆధ్వర్యంలో, అమీర్పేటలో కార్పొరేటర్ సరళ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.
బీజేపీ చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, కార్పొరేటర్ సంగీత ఆధ్వర్యంలో అత్తాపూర్లో, శామీర్ పేట, అలియాబాద్, వికారాబాద్ పట్టణంలో స్థానిక నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు.