
ఢిల్లీ: డీలిమిటేషన్ మీటింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏం పని? అని నిజామాబాద్ ఎంపీధర్మపురి అర్వింద్ నిలదీశారు. బీఆర్ఎస్ వ్యవహారం హైదరాబాద్లో కుస్తీ.. చెన్నైలో దోస్తీలా మారిందని సెటైర్వేశారు. ఢిల్లీలో అర్వింద్మాట్లాడుతూ ‘డీఎంకే డీలిమిటేషన్ సమావేశంలో కాంగ్రెస్ సీఎంతో పాటు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అంటే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరిపోయిందా? నా ఓపినియన్ ప్రకారం ఈ నీచమైన సహజీవనం భవిష్యత్తులో కూడా ఏదో ఒక విధంగా కొనసాగుతుంది’’ అని అన్నారు.
‘నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడు మినహా ఇతర దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా? స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’ అని తెలిపారు.