జమిలి ఎన్నికలతో దేశాభివృద్ధి : డీకే అరుణ

జమిలి ఎన్నికలతో దేశాభివృద్ధి : డీకే అరుణ

పద్మారావునగర్,వెలుగు: దేశాభివృద్ధికి ఆటం కం కలగకుండా ఉండేందుకే కేంద్రం జమిలి ఎన్నికలకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.  బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్​ నియోజకవర్గం బౌద్ధనగర్​ డివిజన్​లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 

 డివిజన్​లో పర్యటించి స్థానికులకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అరుణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు.  స్థానిక నాయకులు సారంగపాణి, వరుణ్​, సుజాత, కీర్తి, హరి, రాజేశ్వర్​ రావు, హనుమంతు, అనిత, ఎస్​ఆర్ ​హాస్పిటల్ ​డాక్టర్​ సంజీవరెడ్డి, రాజు పాల్గొన్నారు.