బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి

బీజేపీ ఎంపీలు రాజీనామా చేయండి

ఖైరతాబాద్​,వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ జరిగిన అన్యాయానికి నిరసనగా కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు​ రాజీనామా చేయాలని సెక్యులర్ డెమోక్రటిక్​ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్​జస్టిస్​చంద్రకుమార్​డిమాండ్​చేశారు. కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ​ఫోరం ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​సమావేశం కోలా జనార్దన్​అధ్యక్షతన జరిగింది. 

ఇందులో చంద్రకుమార్​మాట్లాడుతూ .. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే.. బడ్జెట్​కేటాయింపుల్లో ప్రధాని మోడీ వివక్ష చూపారని మండిపడ్డారు. అంత మంది ఎంపీలుండి తెలంగాణకు ఏమీ చేయలేకపోతే గౌరవం ఉండదని, ఇప్పటికైనా  ప్రధాని వద్దకు వెళ్లి తెలంగాణకు బడ్జెట్​కేటాయించేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్​ నేత పవన్, సౌగరా బేగం, ఎం. నాగరాజు పాల్గొని మాట్లాడారు.