బీజేపీతోనే మెదక్  మెడికల్ కాలేజీ అనుమతి

 బీజేపీతోనే మెదక్  మెడికల్ కాలేజీ అనుమతి
  • మెదక్‌లో కేంద్ర మంత్రి నడ్డా.. ఎంపీ రఘునందన్ రావు ఫొటోకు క్షీరాభిషేకం 
  • మెదక్​ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్​

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లా కేంద్రానికి మెడికల్​ కాలేజీ మంజూరు  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, మెదక్​ఎంపీ రఘునందన్​రావు చేసిన కృషి వల్లే సాధ్యమైందని బీజేపీ మెదక్​ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​ అన్నారు. బుధవారం మెదక్​ పట్టణంలోని బస్​డిపో వద్ద  మంత్రి, ఎంపీల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​ మాట్లాడుతూ... ఎంపీ రఘునందన్ రావు జాతీయ మెడికల్ మండలి వారితో మాట్లాడి మెదక్​కు మెడికల్ కాలేజ్ అనుమతి వచ్చేలా కృషి చేశారన్నారు.

మెదక్​ జిల్లాకు మెడికల్​కాలేజీ అనుమతి రావడంలో నిర్లక్ష్యం చేసిన  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ మురళీ గౌడ్,  రఘువీరారెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి,  శ్రీనివాస్,  శ్రీనివాస్ గౌడ్,  మహేశ్వరి,  సత్యనారాయణ, కాశీనాథ్​, రాగి రాములు, నాయిని ప్రసాద్,  రాజు, రంజిత్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.