- ఎలక్షన్కమిషన్కు సమర్పించిన ఎక్స్పెండిచర్రిపోర్ట్లో కమలం పార్టీ వెల్లడి
- కాంగ్రెస్పార్టీ చేసిన వ్యయం కంటే 3 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రూ. 1,737.68 కోట్లు ఖర్చు చేసింది. పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, క్యాండిడేట్ ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ఇండియాకు సమర్పించిన 2024 లోక్సభ ఎన్నికల ఎక్స్పెండిచర్ రిపోర్ట్లో ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించింది.
న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్, బల్క్ ఎస్ఎంఎస్ ప్రచారాలు, కేబుల్, వెబ్సైట్స్, టీవీ చానెళ్లలో ప్రమోషనల్ కంటెంట్తో సహా మీడియా ప్రకటనల కోసం రూ.611.50 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్, ఫ్లాగ్స్ కోసం రూ. 55.75 కోట్లు వ్యయం చేసింది.
ఇక పబ్లిక్ మీటింగ్స్, బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార సభలు, వేదికల ఏర్పాట్లు, ఆడియో సెటప్లు, బారికేడ్లు, వెహికల్స్కోసం అదనంగా రూ.19.84 కోట్లు వినియోగించింది. అలాగే, స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చులకు రూ.168.92 కోట్లు, ఇతర పార్టీ నాయకుల ప్రయాణానికి రూ.2.53 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
ఇక అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన అరుణాచల్ ప్రదేశ్లో రూ. 5,552.57 కోట్లు, సిక్కింలో రూ. 5,552.41 కోట్లు, ఒడిశాలో రూ.5,555.65 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ తన నివేదికలో వివరించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.585 కోట్లు ఖర్చు చేసింది.
ఈమేరకు నిరుడు ఈసీకి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వ్యవరాలు వెల్లడించింది. అంటే కాంగ్రెస్పార్టీ చేసిన వ్యయం కంటే బీజేపీ ఖర్చు 3 రెట్లు ఎక్కువగా ఉన్నది. దీంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ ప్రధానంగా ప్రచారంపై ఆధారపడినట్టు ఈ ఖర్చుల నివేదిక ద్వారా తెలుస్తున్నది.