![త్రిపుర గవర్నర్ను కలిసిన గూడూరు నారాయణరెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/bjp-state-executive-member-gudur-narayana-reddy-met-tripura-governor-nallu-indrasena-reddy_dhfc5JayVY.jpg)
యాదాద్రి, వెలుగు : త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి కలిశారు. గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించారు. విభిన్నమైన త్రిపుర సంస్కృతి, సంప్రదాయాల గురించి గూడూరు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంపై తాను తీసిన సినిమా 'రజాకార్' సినిమా చూడాలని గవర్నర్ను ఆయన కోరారు. దీనికి నల్లు సానుకూలంగా స్పందించారు.