యూపీ మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు.. 62 వేల ఓట్ల మెజార్టీ

యూపీ మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు.. 62 వేల ఓట్ల మెజార్టీ

అయోధ్య (యూపీ): మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 61,710 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు1.46 లక్షకు పైగా ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి అజిత్ ప్రసాద్​కు 84,687 ఓట్లు వచ్చాయి. గతంలో ఫైజాబాద్ నుంచి ఎస్పీ ఎమ్మెల్యే అవధేశ్ ప్రసాద్ ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన 2024 లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ ఎంపీగా గెలుపొందారు. 

దీంతో మిల్కిపూర్​లో ఉప ఎన్నిక​అనివార్యమైంది. ఈ స్థానంలో బీజేపీ పాసీ సామాజిక వర్గానికి చెందిన పాశ్వాన్​ను నిలబెట్టగా, ఎస్పీ నుంచి ఆయన కుమారుడు అజిత్ ప్రసాద్ బరిలో నిలిచారు. రామాలయం ఫైజాబాద్ లోనే ఉంది. యూపీలో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో బీజేపీ కోల్పోయిన ఏకైక సీటు మిల్కిపూర్. అందువల్ల ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ  గట్టిగా కృషి చేసింది.