![కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ ](https://static.v6velugu.com/uploads/2025/02/bjym-state-president-savella-mahender-suggests-central-government-schemes-should-taken-to-people_dyLutI6l7X.jpg)
కామారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ సెవెళ్ల మహేందర్ సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక మీటింగ్ జరిగింది. స్టేట్ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.
యువత, విద్యావేత్తలు, మేధావులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి జయశ్రీ, బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ వేణు, లీడర్లు ప్రభాకర్, రాజేశ్, భరత్, మనోజ్, కళ్యాణ్, సతీశ్, సాయి, నవీన్, రాజ్గోపాల్ పాల్గొన్నారు.