
కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ నీళ్లు నల్లగా మారాయి. ఈ రిజర్వాయర్ నీటిని మిషన్భగీరథ పథకం కింద సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. వారం రోజులుగా సాగర్ కాల్వ నుంచి రిజర్వాయర్కు నల్లగా ఉన్న నీళ్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈఈ వాణిశ్రీ నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపించారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉండడంతో నల్లగా ఉన్న నీళ్లు సరఫరా అవుతున్నాయని ఐబీ ఆఫీసర్లు చెబుతున్నారు.