
ఆర్మూర్, వెలుగు: ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆర్మూర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి మైలారం బాలు, జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, ఆర్మూర్ మండల కమిటీ అధ్యక్షుడు నాగం శ్రీనివాస్ హాజరై ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.