
- శ్రీసిటీ ప్లాంటు విస్తరణకు రూ.100 కోట్లు
హైదరాబాద్, వెలుగు: బ్లూ స్టార్ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి 150 రూమ్ ఏసీల మోడల్స్ను తీసుకొచ్చింది. ఈ లైనప్లో ఇన్వర్టర్, ఫిక్స్డ్ స్పీడ్, విండో ఏసీలు ఉన్నాయి. ఇవి 0.8 టన్నుల నుంచి 4 టన్నుల వరకు కెసాసిటీల్లో లభిస్తాయి. ధరలు రూ.29 వేల నుంచి మొదలవుతాయి. హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్లూ స్టార్ ఎండీ త్యాగరాజన్ మాట్లాడుతూ ‘‘మాకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ప్లాంటు ఉంది.
దానిని విస్తరించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం. ఆర్అండ్ డీ కోసం మరో రూ.51 కోట్లు ఖర్చు పెడతాం. మా మార్కెట్వాటా ప్రస్తుతం 13 శాతం వరకు ఉంది. 2026 నాటికి దీనిని 14.3 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 2,100 కి పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వీటి సంఖ్యనూ పెంచుతాం.
తెలుగు రాష్ట్రాల్లో 4,500 ఔట్లెట్లు ఉన్నాయి. దాదాపు 15 శాతం మార్కెట్షేర్ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల ఏసీలు అమ్ముతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18 లక్షల యూనిట్లు అమ్ముతామని భావిస్తున్నాం”అని ఆయన వివరించారు.