సింగరేణి లాభాలపై శ్వేతపత్రం ఇవ్వాలి

సింగరేణి లాభాలపై శ్వేతపత్రం ఇవ్వాలి
  • కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యం
  • బీఎంఎస్​ స్టేట్​ ప్రెసిడెంట్ సత్తయ్య

కోల్​బెల్ట్, వెలుగు:  సింగరేణి యాజమాన్యం కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాలో మోసం జరిగిందని బీఎంఎస్ స్టేట్​ప్రెసిడెంట్​యాదగిరి సత్తయ్య ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023– -24 ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.37వేల కోట్ల టర్నోవర్​సాధించిందని యాజమాన్యం ప్రకటించిందన్నారు. 

సింగరేణి  రూ.4,701 కోట్లపైగా లాభాలు సాధించగా.. అందులో 33 శాతం వాటాగా కార్మికులకు రూ.1,551.33 కోట్లు ఇవ్వాల్సింది పోయి రూ.796 కోట్లు ఇస్తూ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్​కు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ నికర లాభాలపై శ్వేతపత్రం రిలీజ్​చేయాలని డిమాండ్​ చేశారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్​ఏరియా బీఎంఎస్​ వైస్​ప్రెసిడెంట్​నాతాడి శ్రీధర్​రెడ్డి, లీడర్లు రాగం రాజేందర్, పురుషోత్తంచారి, గూడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.