ఇరిగేషన్ అధికారులతోనే ప్రాజెక్టుల సర్వే : బోర్డ్ ఆఫ్ సీఈల భేటీలో నిర్ణయం

ఇరిగేషన్ అధికారులతోనే ప్రాజెక్టుల సర్వే :  బోర్డ్ ఆఫ్ సీఈల భేటీలో నిర్ణయం
  • జూన్ నుంచి అమలు.. బోర్డ్ ఆఫ్ సీఈల భేటీలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టులకు సంబంధించిన టెస్టులు, సర్వేలు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇకపై ఇరిగేషన్ డిపార్ట్​మెంట్ సొంతంగా చేసు కోనున్నది. జూన్ నుంచి డిపార్ట్​మెంట్​లోని నిపుణులైన అధికారులతోనే వాటిని నిర్వహించేందుకు ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జలసౌధలో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ సీఈ (బీవోసీ) మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నది.

మీటింగ్​లో 11 అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కచ్చితత్వం, విశ్వసనీయతను పెంచడంలో భాగంగా ఈ సర్వే టూల్స్​ను వినియోగించుకుంటూఇరిగేషన్ అధికారులే సర్వే ఇన్వెస్టిగేషన్స్​ను చేయాలని నిర్ణయించారు. అయితే, ఆర్ అండ్ బీ, సర్వే విభాగాల్లో స్టాఫ్ కొరత ఉన్న నేపథ్యంలో తాము చేయలేమని ఆయా విభాగాల సీఈలు మీటింగ్​లో తెలిపారు.

మరోవైపు ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల్లో నాణ్యత పెంచేందుకు క్వాలిటీ మేనేజ్​మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్​లను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన హైడ్రాలజీ, హైడ్రాలిక్స్ (గేట్లు), ప్రాజెక్ట్ అలైన్​మెంట్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోనున్నారు.