
- ఎడపల్లి, రెంజల్ మండలాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఎడపల్లి/రెంజల్(నవీపేట్)/బోధన్, వెలుగు : పల్లెల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జానకంపేట్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.40 లక్షల తో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం జాకంపేట్ గ్రామంలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. రెంజల్ మండలం దుపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.12లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాం ఎమ్మెల్యే ప్రారంభించారు.
పెగడపల్లిలో ప్రీమియం లీగ్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగాదర్, అంతిరెడ్డి రాజిరెడ్డి, నగేశ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగభూష్ణం రెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పులి శ్రీనివాస్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.