సింగరేణి ట్రాన్స్​పోర్ట్​ కార్మికుల వేతనాలు పెంచాలె : ​బోగె ఉపేందర్

సింగరేణి ట్రాన్స్​పోర్ట్​ కార్మికుల వేతనాలు పెంచాలె : ​బోగె ఉపేందర్
  • కార్మికుల నిరవధిక సమ్మె షురూ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ డైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచాలని బెల్లంపల్లి రీజియన్ ఏఐటీయూసీ ప్రెసిడెంట్​ బోగె ఉపేందర్​ డిమాండ్​చేశారు. వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కారించాలని మందమర్రి ఏరియాకు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ ​చేస్తూ బుధవారం నిరవధిక సమ్మెకు దిగారు. వీరికి ఏఐటీయూసీ మద్దతు తెలిపింది.

ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ..  సింగరేణి సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్ట్ ​కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. కార్మిక చట్టాలు అమలు కాకపోవడంతో వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. డ్రైవర్లకు కనీస వేతనం రూ.32వేలు, క్లీనర్​కు రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్​ఐ, పీఎఫ్, బోనస్​ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెలా 10న జీతాలు చెల్లించాలన్నారు. సమ్మెలో సింగరేణి కాలరీస్ కోల్ ట్రాన్స్​పోర్ట్​వర్కర్స్​ యూనియన్ జనరల్​ సెక్రటరీ మిట్టపెల్లి పౌల్, కుమార్, శ్రీశైలం, రవి తదితరులు పాల్గొన్నారు.