స్టార్ హీరోయిన్ చనిపోయిందంటూ ప్రచారం.

స్టార్ హీరోయిన్ చనిపోయిందంటూ ప్రచారం.

దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్ ఇటీవలే దో పత్తి అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కాజోల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజోల్ నటించింది. ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శశాంక చతుర్వేది దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కృతి సనన్ ద్విపాత్రాభినయం చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి కాజోల్ తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు గురించి అభిమానులతో పంచుకుంది. 

ఇందులో భాగంగా కొందరు తాను మరణించినట్లు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పుకార్లు ప్రచారం చేస్తుంటారని తెలిపింది. ఓసారైతే  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఏకంగా తాను విమాన ప్రమాదంలో మరణించానని చెప్పారని దాంతో వారు ఎంతగానో ఇబ్బంది పడ్డారని చెపుకొచ్చింది.

Also Read :- చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ .. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు

ఇంకొందరు కాజోల్ మరణించింది అంటూ వార్తలు రాసి ప్రచారం చేశారని బ్రతికున్న వ్యక్తి  గురించి ఇలా ఎలా ప్రచారం చేస్తారంటూ సీరియస్ అయ్యింది. ఇలా తప్పుడు ప్రచారాలు చేయడంవలన తన బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కుంటున్నానని ఎమోషనల్ అయ్యింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి కాజోల్ ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, తదితర స్టార్ హీరోలతో కలసి నటించి మెప్పించింది.

అయితే నటి కాజోల్ బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ ని 1999లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళయిన తర్వాత పిల్లలు, కుటుంబ భాద్యతలకోసమని సినిమాలకి ప్రాధాన్యత తగ్గించింది. అయితే ఈ మధ్య పిల్లలు పెద్దవాళ్ళవడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది.