
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సినీ నటి కంగనా రనౌత్ ఎంపీగా గెలిచారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాక ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. ఫస్ట్ టైం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరుపున కంగనా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విక్రమాధిత్యాపై ఆమె 5లక్షల 24వేల ఓట్లతో గెలిచింది. కుటుంబ సభ్యులతో ఆమె స్వీట్లు పంచుకుంటున్న ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కంగనా ఆమె గెలుపును నరేంద్ర మోదీ గెలుపుగా ప్రకటించింది. తనకు మద్దతుగా నిలబడిన మండి నివాసులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ఈ ప్రేమ, విశ్వాసం ఈ విజయం మీ అందరిది అని కంగనా ట్విట్ చేశారు. ఇది ప్రధాని మోడీ మరియు బిజెపిపై విశ్వాసం, ఇది సనాతన్ విజయం, ఇది మండి గౌరవ విజయం తన ఆఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చింది.