
Nidhi Agarwal: నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో హిట్ అందుకున్న నిధి.. ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగా ఆక ట్టుకుంది.
ఈ అమ్మడు ఇప్పుడు ఇద్దరు బడా స్టార్స్ సినిమాలో చాన్స్ అందుకుంది. పవన్ కల్యాణ్ తో 'హరిహర వీరమల్లు', ప్రభాస్ తో 'రాజా సాబ్' చి త్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది. 'బాలీవుడ్ చిత్రం 'మున్నా మైకేల్’ మూవీ తో నా సినీ కెరీర్ మొదలైంది. టైగర్ షాఫ్ హీరోగా నటించారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్ పై సంతకం చేయించుకుంది.
సినిమాకు సంబంధించిన నేను పా టించాల్సిన విధానాలు అందులో రాసి ఉన్నాయి. అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్ చేయకూడదు దాని అర్థం. అయితే కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పు డు నేను పెద్దగా అవన్నీ చూడలేదు. ఆ తర్వాత నాకు ఈ విషయం తెలిసి షాక్అయ్యా. నటీనటులు ప్రేమలో పడితే వర్పై దృష్టిపెట్టరని ఆ టీమ్ భావించి ఇలాంటి షరతులు పెట్టి ఉంటుంది' అని నిధి పేర్కొంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిధి తెలుగులో హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హరిహర వీరమల్లు మార్చ్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో మే నెలకి వాయిదా పడింది. ఇక ప్రభాస్ రాజాసాబ్ కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ షూటింగ్, సీజీ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ అయినట్లు సమాచారం..