
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa shetty) ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. నిన్న ఇండిపెండెంట్స్ డే సందర్భంగా ఈ నటి తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ ఫొటోలు నెట్టింట షేర్ చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఈ ఫొటోలో ఆమె తన ఫ్యామిలీతో పాటు చెప్పులేసుకుని జెండాను ఎగురవేసింది. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్కి దిగారు.
ఈ నటికి ఈ మాత్రం కామన్సెన్స్ లేదా? అంటూ మండిపడుతున్నారు. ఈ ట్రోలింగ్పై శిల్పా శెట్టి స్పందించింది. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ టైంలో చెప్పులేసుకోకూడదన్న రూల్ ఎక్కడా లేదని తెలిపింది. గూగుల్ నుంచి ఇందుకు సంబంధించిన ఓ స్క్రీన్షాట్ను కూడా షేర్ చేసింది. మీలా పనిగట్టుకుని విమర్శలు చేసేవారిని నేనస్సలు పట్టించుకోనంటూ తెలిపింది.