బోడుప్పల్ లో బీఓఎం బ్రాంచ్​ ఓపెన్

బోడుప్పల్ లో బీఓఎం బ్రాంచ్​ ఓపెన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బోడుప్పల్​లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) బ్రాంచ్​ను జోనల్​మేనేజర్​జీఎస్డీ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోడుప్పల్ బ్రాంచ్​తో రాష్ట్రంలోని బీఓఎం బ్రాంచ్​లు 74కు చేరాయన్నారు. 

ప్రజలకు సురక్షిత బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 2400 బ్రాంచీల్లో 30 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాంచ్​మేనేజర్​అభిజిత్ చందుపట్ల, సిబ్బంది పాల్గొన్నారు.