![పాకిస్తాన్లో బాంబు పేలి 11 మంది మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/bomb-blast-kills-11-coal-miners-in-pakistan-balochistan_yvPgVfCAaE.jpg)
- మృతులంతా బొగ్గు గని కార్మికులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బాంబు పేలి 11 మంది బొగ్గు గని కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్.. హర్నై జిల్లాలోని షహ్రాగ్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మినీ ట్రక్కులో 18 మంది కార్మికులను తీసుకెళ్తుండగా.. రోడ్డు పక్కన అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పై నుంచి వెహికల్ వెళ్లడంతో పేలుడు సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని హర్నై డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కాకర్ తెలిపారు. గాయపడిన ఏడుగురు కార్మికులను ట్రీట్మెంట్ కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.