సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బాంబ్ బెదిరింపు కాల్

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్కు బాంబ్ బెదిరింపు కాల్

సికింద్రాబాద్  రైల్వే స్టేషన్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. ఆగి ఉన్న   బెల్గావి   ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి పొలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో  వెంటనే అప్రతమైన పోలీసులు, రైల్వే సిబ్బంది  రైల్వే స్టేషన్ కు పరుగులు పెట్టి   డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. దాదాపు అరగంట పాటు బళ్ళారి రైలులో తనికులు చేయగా బాంబు దొరక్కపోవడంతో  పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  ఫోన్ చేసిన వ్యక్తి సంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బాలరాజుగా గుర్తించారు. అయితే ఎవరో ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్లో బాంబు గురించి మాట్లాడుకుంటుండగా విని  ఫోన్ చేసినట్లు పోలీసులు చెప్పారు.