వందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు కలకలం

వందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు కలకలం

వందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. సికింద్రాబాద్ నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్‎లో బాంబ్ ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆర్పీఎఫ్ అధికారులు రంగంలోకి ట్రైన్‎లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‎తో ట్రైన్ మొత్తం విస్తృతంగా సోదాలు చేశారు. 

వందే భారత్  ట్రైన్‎లో ఎలాంటి బాంబ్, అనుమానస్పద పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి హైదరాబాద్ లోని శేరిలింగంపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం