నాడు డీఎస్​.. నేడు మహేశ్​

నాడు డీఎస్​.. నేడు మహేశ్​
  • పీసీసీ చీఫ్​గా నియామకంతో పార్టీలో జోష్​
  • కాంగ్రెస్​ అధికారంలోకిరావడంతో మారిన సమీకరణలు
  • జిల్లాలో  కొనసాగుతున్న పార్టీ హవా
  • డీఎస్​ తరువాత మహేష్​కు కీలక పదవి
  • ఇద్దరూ బీసీ నేతలే కావడం విశేషం

నిజామాబాద్, వెలుగు: ఇందూర్​ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్​​కుమార్​గౌడ్​ టీపీసీసీ ప్రెసిడెంట్​గా నియమితులయ్యారు. స్టూడెంట్​లీడర్​ గా పాలిటిక్స్​లో చేరి అంచలంచెలుగా ఎదిగి, ఇప్పుడు పీసీసీ పీఠం దక్కించుకున్నారు.  పార్టీలో మహేశ్​​ సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తించిన కాంగ్రెస్​ పెద్దలు ఆయనకు రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించారు. పదేండ్ల విరామం తరువాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్​లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సమీకరణలు మారి జిల్లాలో పార్టీ హవా నడుస్తోంది. ఇప్పుడు మరో కీలకమైన పోస్టు జిల్లా ఖాతాలో చేరడంతో క్యాడర్​ మరింత జోష్​లో ఉంది. 

నో బ్యాక్​ గ్రౌండ్​

భీంగల్​ మండలం రహాత్​నగర్​విలేజ్​కు చెందిన మహేశ్​గౌడ్​ ఫ్యామిలీకి ఎలాంటి పొలిటికల్​ బ్యాక్​గ్రౌండ్​ లేదు. తండ్రి గంగాధర్​గౌడ్​కు మంచి రైతుగా పేరుంది. నక్సలైట్ల (మావోయిస్టుల) సమస్యతో ఆయన 1970వ దశకంలో తన కుటుంబాన్ని జిల్లా కేంద్రంలోని గోల్​హనుమాన్​ ఏరియాకు మార్చారు. అక్కా, తమ్ముడు, చెల్లె ఉన్న మహేష్​ చదువు డిగ్రీ వరకు ఇందూర్​ గిరిరాజ్​కాలేజీలో ముగిసింది.

మహారాష్ట్రలో ఎల్ఎల్​బీ చేశారు. తండ్రి గంగాధర్​గౌడ్​ కాంగ్రెస్​ పార్టీకి గట్టి సపోర్టర్​గా ఉండేవారు.  మహేష్​శ్​గౌడ్​లో కూడా ఎన్ఎస్​యూఐ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. డిగ్రీ కాలేజీలో స్టూడెంట్​యూనియన్​కు వైస్​ ప్రెసిడెంట్​గా వ్యవహరించిన మహేశ్​గౌడ్​లోని లీడర్​షిప్​ క్వాలిటీస్ గుర్తించిన కాంగ్రెస్​ ఆయన్ను బాగా ఎంకరేజ్​ చేసింది.

 ​జిల్లా ఎన్​ఎస్​యూఐ  (1986-‌‌–90) ప్రెసిడెంట్ గా,   తర్వాత ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా (1990-–98 )పనిచేశారు.  అనంతరం యూత్​ కాంగ్రెస్​ సెక్రటరీ (1998-–2000)గా పనిచేస్తున్న టైంలో హైకమాండ్​ ఆయన్ను ఏపీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా,  టీపీసీసీ జనరల్​ సెక్రటరీగా నియమించింది. 2021 నుంచి పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా పనిచేస్తున్నారు.

ఆటుపోట్లకు ఎదురొడ్డి

మహేష్​గౌడ్​ జిల్లా కాంగ్రెస్​లో ఉద్దండ నాయకులను తట్టుకొని పాలిటిక్స్​లో నిలదొక్కుకున్నారు. స్టూడెంట్​ లీడర్​గా ఎన్​ఎస్​యూఐలో ఉంటూ డిచ్​పల్లి సెగ్మెంట్​ నుంచి 1994లో  అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత మళ్లీ పోటీ అవకాశం దక్కకపోగా పలు ఆటుపోట్లు తట్టుకొని  నిలబడ్డారు. 2023లో అర్బన్​ టికెట్​ ఆశించారు. 2003లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినా అక్కడ ఇమడలేక ఏడాదిన్నరకే ఘర్​వాపస్​ అయ్యారు. 2013-‌‌14లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చైర్మన్​గా పనిచేసిన మహేశ్​​గౌడ్​ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్​ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారి చట్టసభలోకి ఎంట్రీ ఇచ్చారు. 

డీఎస్ శిష్యుడే

జిల్లా రాజకీయాలలో చెరగని ముద్రవేసిన డి.శ్రీనివాస్​ (డీఎస్​) ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన మహేశ్​​గౌడ్​ రాష్ట్ర  ప్రెసిడెంట్ గా నియమితులై  గురువుకు తగ్గ శిష్యుడయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ పీసీసీ ప్రెసిడెంట్​గా డీఎస్​కు రెండుసార్లు అధిష్టానం అవకాశం ఇచ్చింది. 2004, 2009 ఎలక్షన్స్​లో రెండుసార్లు  ఆయన పార్టీని అధికారంలోకి తెచ్చారు.  

​బీసీ సామాజిక వర్గానికి డీఎస్​ తరువాత జిల్లాకు చెందిన మరో బీసీ లీడరే రాష్ట్ర కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ అయ్యారు.  మూడేండ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉండే మహేష్​గౌడ్​కు ఏఐసీసీ ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు ఆయన పదవి పొందడానికి దోహదపడ్డాయి. ​రూలింగ్​ పార్టీలో ప్రెసిడెంట్​ హోదాను సీఎం తరువాత స్థానంగా  క్యాడర్​ భావిస్తుంది.