మల్లన్న ఆలయంలో ఘనంగా పెద్ద పట్నాలు, బోనాల జాతర

మల్లన్న ఆలయంలో ఘనంగా  పెద్ద పట్నాలు, బోనాల జాతర

ముత్తారం, వెలుగు: ముత్తారం మండలం ఓడెడ్ గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్ద పట్నాలు, బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలతో పట్నాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మల్లికార్జునస్వామికి వివాహం జరిపించారు.