
దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తెగా ఇండస్టీకి పరిచయమైన యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా ఖుషీ కపూర్ తన తల్లి చివరిసారిగా తెరపై కనిపించిన చిత్రం సీక్వెల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఐఫా వేడుకలో 'మామ్ 'కు సీక్వెల్ తీయబోతున్నట్లు శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఈ విషయాన్ని ప్రకటించారు.
'ఖుషీ ఇప్పటివరకూ నటించిన సినిమాలన్నీ నేను చూశా. 'ఆర్చీస్', 'లవ్ యాపా'ల్లో అద్భుతంగా నటించింది. ఆమెతో నేను త్వరలోనే సినిమా తీస్తనని బోణి కపూర్ తెలిపారు. అది 'మామ్ 2' కావొచ్చు. ఖుషీ తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. శ్రీదేవి నటించిన అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఇప్పుడు జాన్వీ కపూర్, ఖుషీలు కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతారని సమ్ముతున్న అని ఈ సందర్భంగా ' బోనీ కపూర్ 'పేర్కొన్నారు.
ఇక 'మామ్' విషయానికొస్తే ఉద్యావర్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఈ సినిమాకు కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుం ది. ఇందులో శ్రీదేవి నటనకు మరణానంతరం ఉత్తమ నటి అవార్డు వరించింది.
ఇకపోతే ఖుషి కపూర్.. హిందీలో ఇప్పటి వరకు ఖుషి కపూర్ మూడు సినిమాల్లో నటించింది. ఆ మూడు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. మొన్నటికి మొన్న నాదానియ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకుంది. మరి మామ్ 2 లో నటిస్తే ఎలాంటి పాత్ర చేస్తుందో చూడాలి.