రాజగోపాల్ రెడ్డి రాజీనామా అందరూ ఊహించిందే : బూర నర్సయ్య గౌడ్

రాజగోపాల్ రెడ్డి రాజీనామా అందరూ ఊహించిందే  : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశం అందరూ ఊహించిందేనని, కొత్త న్యూస్ ఏం కాదని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆయన శరీరం మాత్రమే బీజేపీలో ఉందని, ఆత్మ కాంగ్రెస్​లోనే ఉందని ఆరోపించారు. బుధవారం అలయ్ బలయ్ కార్యక్రమంలో బూర నర్సయ్య మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్​ను నమ్మే స్థితిలో పబ్లిక్ లేరని, కేసీఆర్​ని ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించే పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేనన్నారు. హైకమాండ్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని, భువనగిరి నుంచి ఎంపీ గా పోటీ చేయాలని ఆసక్తి ఉందన్నారు. 

బీజేపీలోనే కొనసాగుతా: మర్రి శశిధర్ రెడ్డి

గాలికి వచ్చి వెళ్లే వ్యక్తిని కాదని, బీజేపీలోనే కొనసాగుతానని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.  అన్ని అంశాలు ఆలోచించే పార్టీ మారానని, బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం అలయ్ బలయ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

ALS0 READ: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన 12మంది మృతి