ఛత్తీస్​గఢ్​ బార్డర్​లో అలర్ట్ .. మావోయిస్టుల బంద్​ పిలుపుతో మన్యంలో ఆంక్షలు

ఛత్తీస్​గఢ్​ బార్డర్​లో అలర్ట్ .. మావోయిస్టుల బంద్​ పిలుపుతో మన్యంలో ఆంక్షలు

భద్రాచలం, వెలుగు: ఇటీవల ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలో జరిగిన ఎన్​కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన బంద్​ పిలుపు మేరకు తెలంగాణ, -ఛత్తీస్​గఢ్​ బార్డర్​లో మంగళవారం హై అలర్ట్  ప్రకటించారు. బంద్​ పిలుపుతో మన్యంలో ఆంక్షలు విధించారు. గోదావరి తీరం వెంట నిఘా పెంచారు. దళాల కదలికలను నియంత్రించేందుకు దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్​ ఆపరేషన్లు నిర్వహిస్తుంగా, యాక్షన్  టీమ్​ కట్టడికి భద్రాచలం డివిజన్​లోని అన్ని పోలీస్​స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. 

గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘా పెట్టడంతో పాటు రాత్రి పూట మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. భద్రాచలం నుంచి ఏపీలోని మారేడుమిల్లి, సీలేరు, విశాఖ ఘాట్​ రూట్లలో వెళ్లే బస్సులను దారి మళ్లించారు. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే బస్సులు, ఆటోలను కూనవరం, బీమవరం మీదుగా పంపిస్తున్నారు. పొలిటికల్​ లీడర్లు, ప్రజాప్రతినిధులు, మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.