జీడిమెట్లలో కరెంట్​ షాక్​తో బాలుడు మృతి

జీడిమెట్లలో కరెంట్​ షాక్​తో బాలుడు మృతి

జీడిమెట్ల, వెలుగు: సూరారంలో కరెంట్​షాక్​తగిలి బాలుడు మృతి చెందాడు. కైసర్​నగర్​కు చెందిన మహ్మద్​ అలీమ్ ​ఖాన్​కొడుకు ఎజాజ్​(13) స్థానిక అరబిక్​ పాఠశాలలో చదువుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో స్క్రాప్​ ఏరుకొని విక్రయిస్తున్నాడు. 

కైసర్​నగర్​లో  కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో సోమవారం సాయంత్రం విద్యుత్తు వైర్లను కట్టింగ్​ ప్లేయర్​తో కట్​చేయడంతో ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​తగిలి 
మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ భరత్​కుమార్ ​తెలిపారు.