
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలో కరెంట్ షాక్తో బాలుడు చనిపోయాడు. ఆదివారం బడికి సెలవు కావడంతో తండ్రి బసంతప్ప, తల్లి గౌరమ్మ తమ కొడుకు మణితేజ (9)ను ఎద్దులకు నీళ్లు తాగించేందుకు గ్రామంలో నీటి తొట్టె వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఈదురు గాలులు వీయడంతో నీటి తొట్టె పక్కనే ఉన్న చెట్టు విరిగి కొమ్మలు కరెంట్ వైర్లపై పడ్డాయి. అక్కడే ఉన్న మణితేజ, గౌరమ్మపై కరెంట్ వైర్లు పడటంతో వారికి షాక్ తగిలింది. మణితేజ అక్కడికక్కడే చనిపోగా, గౌరమ్మ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను కొడంగల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బొంరాస్ పేట ఎస్ఐ రవూఫ్ తెలిపారు.