
పద్మారావునగర్,వెలుగు : ఆరుగురి మిస్సింగ్ కేసును బోయిన్ పల్లి పోలీసులు చేధించారు. న్యూబోయిన్పల్లి ఏడుగుళ్ళ సమీపంలో మహేశ్, ఉమా దంపతులు తమ పిల్లలైన రిషి, చైతు,శివన్తో ఉంటున్నారు. మహేశ్ నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ . ఇదే ప్రాంతంలో ఉండే వీరి బంధువు సంధ్య శుక్రవారం వీరి ఇంటికి వచ్చింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు బిక్షపతి.. మహేశ్ఇంటికి రాగా ఎవరూ కనిపించలేదు.
ఇంటి యజమానిని వాకబు చేయగా అందరూ బయటకు వెళ్లినట్లు తెలిసింది. అర్ధరాత్రి అయినా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంక్వైరీ చేయగా ఆటోలో ఎంజీబీఎస్ కు, అక్కడి నుంచి విజయవాడకు వెళ్లినట్టు తెలిసింది. దీంతో విజయవాడ వెళ్లి ఆరుగురిని బోయిన్పల్లి పీఎస్కు తీసుకువచ్చారు. కుటుంబ తగాదాల కారణంగానే ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లినట్టు చెప్పారు.