పాపికొండల విహార యాత్రకు బ్రేక్

పాపికొండల విహార యాత్రకు బ్రేక్

భద్రాచలం, వెలుగు : పాపికొండల విహారయాత్రకు బ్రేక్ ​పడింది. తుఫాన్​ కారణంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విలీన ఆంధ్రా వీఆర్​పురం మండల తహసీల్దార్ ​విహార యాత్రను నిలిపివేయాలని ఆదేశించారు. లాంచీలు తిప్పొద్దని యజమానులకు నోటీసులు ఇచ్చారు. భద్రాచలం రాములవారి దర్శనం తర్వాత భక్తులు వీఆర్​పురంలోని పోచవరం వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో పాపికొండల విహార యాత్ర చేస్తారు. కానీ, అధికారులు సోమవారం వరకు తాత్కాలికంగా యాత్ర నిలిపివేశారు.