ప్రమాదకరంగా రాయికోడ్ బ్రిడ్జి

ప్రమాదకరంగా రాయికోడ్ బ్రిడ్జి
  • కూలిన సైడ్ పిల్లర్లు 

రాయికోడ్,  వెలుగు: సంగారెడ్డి జిల్లా  రాయికోడ్ మండల కేంద్రంలో  వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు సమీపంలో  వాగుపై నిర్మించిన బ్రిడ్జి (వంతెన ) ప్రమాదకరంగా మారింది. శనివారం కురిసిన భారీ వర్షానికి సైడ్ పిల్లర్లు కూలిపోయాయి.  వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి  ఇరుపక్కల సైడ్ వాల్స్ (పిల్లర్లు )కూలి నీటిలో పడ్డాయి.  దీంతో  ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. సైడ్ వాల్సే కాకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తోంది.

దీంతో బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందోనని ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. జహీరాబాద్, బీదర్,నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఈ బ్రిడ్జి నుంచే వాహనాలు వెళ్తుంటాయి.  ఇప్పటికైనా ఆర్‌‌‌‌అండ్‌‌బీ అధికారులు స్పందించి  బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని రాయికోడ్ మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.