పేదల గుడిసెలు కూల్చడం సరికాదు: బృందా కారత్  

పేదల గుడిసెలు కూల్చడం సరికాదు: బృందా కారత్  

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్  జిల్లాలో  ప్రభుత్వ స్థలాల్లో  పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం దారుణమని,  తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తే ఎర్రజెండా చూస్తూ ఊరుకోదని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్​ బృందా కారత్  హెచ్చరించారు. మహబూబాబాద్‌‌లో  తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బస్సు జాతాను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బృందాకారత్​ మాట్లాడుతూ..  బీజేపీకి  వ్యతిరేకంగా  ఉద్యమాలు కొనసాగించడానికి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.  ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్​ ఎస్​. వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు జి. నాగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్​ పాల్గొన్నారు.