
పుతిన్కు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరిక
లండన్: అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విమరణను ఒప్పుకోకుండా రష్యా శాంతితో ఆటలాడితే తాము అనుమతించబోమని యూకే పీఎం కీర్స్టార్మర్ వార్నింగ్ ఇచ్చారు. సీజ్ఫైర్ను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సీరియస్గా తీసుకోవట్లేదన్నారు.
రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పాలని అమెరికా ప్రెసిడెంట్ట్రంప్ ప్రయత్నిస్తుంటే.. పుతిన్ పట్టించుకోవడంలేదని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆలస్యం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు.
యురోపియన్ యూనియన్, నాటో దేశాలు దీనికి కట్టుబడి ఉంటాయని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘శాంతిని నెలకొల్పాలని పుతిన్ భావిస్తే.. ఉక్రెయిన్పై చేస్తున్న అనాగరిక దాడులను వెంటనే ఆపేయాలి. సీజ్ఫైర్కు అంగీకరించాలి. ప్రపంచం మొత్తం గమనిస్తున్నది” అని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా అంగీకరించకుంటే ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని పెంచి.. దారికి తేవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలాగే, రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతూ తనను తాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్కు సైనిక సాయం అందించాలని అన్నారు