
బషీర్బాగ్, వెలుగు: తాను వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ అమీన్ పూర్ సంక్షేమ సంఘం సీఎం రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ లెటర్వైరల్అవుతోందని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ తెలిపారు. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇదంతా చేస్తున్నవారిపై యాక్షన్తీసుకోవాలని డీజీపీ, హైడ్రా కమిషనర్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫహీమ్ ఫిర్యాదు చేశారు. ముందుగా బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ కు వెళ్లిన ఆయన ఫేక్ లెటర్ వెనక బీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉందని ఫిర్యాదు చేశారు. తర్వాత డీజీపీ ఆఫీసుకు వెళ్లి కంప్లయింట్ఇచ్చారు. హైడ్రా కమిషనర్ కు కంప్లయింట్ఇచ్చారు.