ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మరో యాగం

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మరో యాగం

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరో యాగం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్  నవగ్రహ మహాయాగం చేపట్టారు. కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి వేద పండితులతో ప్రత్యేక పూజలు చేశారు.  ఎమ్మెల్సీ కవిత ఈ యాగంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Also Read :- గణేష్ మండపాల దగ్గర పోలీస్ ఆంక్షలు

రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం,  కేసుల ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు మాజీ సీఎం యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ 2015లో చండీయాగం,2018,2023లో రాజశ్యామల యాగం చేశారు.