ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠాణీలు అమ్మినట్టు అమ్మిన్రు : సీఎం రేవంత్ రెడ్డి

 ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠాణీలు అమ్మినట్టు అమ్మిన్రు : సీఎం రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  గొర్రెలు, బతుకమ్మ చీరల పంపిణి పేరుతో కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తెచ్చి పంచారని విమర్శించారు. గారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు అమ్మారని తెలిపారు. కట్టడాల లెక్కల గురించి హరీశ్ చెబుతున్నారు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

  ఔటర్ రింగ్ రోడ్డును  పల్లి బఠాణీలు అమ్మినట్టు అమ్మారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాలమూరు ప్రజలు ఏం పాపం చేశారని మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కన్న ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎక్కువ జరిగిందని చెప్పారు.